Friday, May 26, 2017

Power star Pawan Kalyan will Rock this time with Trivikram Mark direction



Power Star Pawan Kalyan's 25th film Trivikram is going to be directed by Gokula Krishna.





The film is known to be the heroines of Kirti Suresh and Ani Immanuel.


So far, though not as much as  in English some  revenge story have arrived, as well as in Hollywood movies with a lot of good stories have a lot of revenge. Even in Bollywood, some have come up with Super Duper hits but say that it is not a proper Revenge Story.



Rajathekhar is the hero of the movie when the film is a good revenge drama but it remains an apter. It is also a remake of Shahrukh's super-duper hit movie 'Baazighar' in Hindi.


But Pawan Kalyan's pants for a while now is a big news. It is said that Pawan's 25th film 'Gokula Krishna' is a great Revenge Story.


Trivikram was not aware of the matter, but it was the reason why Pawan was unable to keep the unit.



Pawan's father has two wives in the film. Pawan Kalyan, the second son, will be seen as a very talented talent in the film.



Some evil people will kill Pawan's father in the flashback and kill him unkindly.


When Pawan learns about this, how can he get to his dad and how to get their revenge on their men?


If you have such a good revenge story with the Trivikram mark direction, it can be a good idea to know how the box office is hit if you star power star.



So, the power star fans with all the best.



For more information on our news, visit this blog: www.pawankalyanlatestnews.blogspot.com OR
www.comingsoonchanel.blogspot.com

Thankyou


పవన్ త్రివిక్రమ్ వాళ్ళ ఇండస్ట్రీ కి అదిరిపోయే హిట్ రాబోతోందా? ఐతే ఈ సారి పవన్ ప్యాన్స్ కు ఖుషి లాంటి పండగే



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25 వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న సినిమా "గోకుల కృష్ణుడు".









 ఈ సినిమా లో కీర్తి సురేష్ మరియు అను ఇమ్మాన్యుల్ హీరోఇన్లు గా నటిస్తున్న విషయం తెలిసినదే.



ఐతే ఇప్పటి దాకా ఎక్కువ గా కాకపోయినా తెలుగులో కొన్ని రివెంజ్ స్టోరి లు వచ్చాయి, అలాగే హాలీవుడ్ లో చాల మంచి మంచి రివెంజ్ స్టోరీస్ తో కూడిన సినిమాలు చాలా ఉన్నాయి. మన బాలీవుడ్ లో కుడా కొన్ని వచ్చి సూపర్ డూపర్ హిట్స్ కొట్టాయి కానీ తెలుగు లో ఇప్పటిదాకా సరైన రివెంజ్ స్టొరీ యెదీ రాలేదనే చెప్పాలి.



అప్పుడెప్పుడో రాజశేఖర్ హీరో గా వచ్చిన వేటగాడు సినిమా మంచి రివెంజ్ డ్రామా నే అయినా అట్టర్ ప్లాప్ గానే మిగిలిపోయింది. అది కుడా హిందీ లో షారుఖ్ నటించిన 'బాజీఘర్' అనే సూపర్ డూపర్ హిట్ సినిమా కి అది రీమేక్ చిత్రమే..




ఐతే ఇన్నాళ్ళకు పవన్ కళ్యాణ్ ప్యాన్స్ కు ఇప్పడు మాత్రం ఒక సుభ వార్త చెప్పి తీరాలి. అది ఎమిటంటే పవన్ 25 వ సినిమా గా చెప్తున్న 'గోకుల కృష్ణుడు' మాత్రం ఒక గొప్ప రివెంజ్ స్టొరీ అని తెలిసింది.



త్రివిక్రమ్ ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఎంత జాగ్రత్త పడినా పవన్ కు ఉన్న క్రాజ్ కారణం గా ఈ విషయం గోప్యం గా ఈ చిత్ర యూనిట్ ఉంచలేక పోయింది.



ఇక స్టొరీ విషయానికి వస్తే సినిమా లో పవన్  తండ్రి గారికి ఇద్దరు భార్యలు. రెండవ కొడుకైన పవన్ కళ్యాణ్ సినిమా లో చాలా టెక్నికల్ టాలెంట్ ఉన్న వ్యక్తిగా కనిపించ బోతున్నారు.



కొందరు దుర్మార్గులు ఫ్లాష్ బ్యాక్ లో పవన్ తండ్రిని అతి కిరాతకంగా అన్యాయంగా చంపుతారు.



ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ తన తండ్రిని కడతేర్చిన వాళ్ళ దగ్గరికి ఎలా చేరుతాడు, వాళ్ళ మీదా, వాళ్ళ మనుష్యు ల మీదా ఉన్న రివెంజ్ ని ఎలా తీర్చుకుంటాడనేదే అసలు మూల కధ గా చెప్తున్నారు.



ఇటువంటి మంచి రివెంజ్ కధ కి కనుక త్రివిక్రమ్ మార్క్ డైరెక్షన్ తోడైతే, అది కుడా పవర్ స్టార్ నటిస్తే బాక్స్ ఆఫీస్ ఎలా బధలవుతుందో ఒక్కసారి ఉహించుకోవచ్చు.



సో, అల్ ది బెస్ట్ తో పవర్ స్టార్ ప్యాన్స్.



ఇంకా మరిన్నిసినిమా వార్తలూ విశేషాల కోసం, ఈ బ్లాగ్ క్రింది ని సందర్శించండి: www.powerstarlatestnews.blogspot.com






Thursday, May 25, 2017

సూపర్ స్టార్ రజని కొత్త సినిమా కి అదిరిపోయే టైటిల్ ఫిక్స్: కాలా


సూపర్ స్టార్ రజని కాంత్ క్రొత్త సినిమా డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం లో రాబోయే చిత్రానికి అదిరిపోయే టైటిల్:

రజని ఇప్పటికే రంజిత్ దర్శకత్వం లో కబాలి సినిమా తీసారు. సూపర్ స్టార్ క్రొత్త సినిమా కి కాలా” ది కరికలన్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. 
కాలా” కబాలి కి రెండవ భాగం అని చెప్తున్నారు.






ఆ సినిమా తమిళం లో సూపర్ హిట్ అయినా తెలుగు రాష్ట్రాల్లో అంట బాగా అలరించలేక పోయింది.
ఐతే ఇండియా లో కొన్ని ప్రాంతాలలో బాగా హిట్ అయ్యింది.



ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఇమేజ్ చాలా పీక్ స్టేజి లో ఉంది. మొన్నామధ్య అయన ప్యాన్స్ తో రాజకీయ రంగ ప్రదేశం గురించి మీటింగ్ పెట్టడం సంచలనం సృష్టించింది.

ఐతే ఆంధ్ర ప్రదేశ్ లో పవర్ స్టార్ మానియా కుడా చాలా ఎక్కువగా ఉంది. అయన కుడా 2019 లో ఎలక్షన్స్ లో నిలబడతానని చెప్పారు. ఇలా ఇద్దరూ ఒకే టైం లో రాజకీయాల్లోకి అడుగు పెట్టడం సౌత్ ఇండియాలో ఎంతో ఆశక్తిని రేకెత్తిస్తుంది..

ఈ ఇద్దరి స్టార్ల కూ ఒకే విధమైన లక్షణాలు ఉండడం ఆసక్తికరం. ఇద్దరూ చాలా సింపుల్ గా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు. గర్వాన్ని ఎట్టి పరిస్తుతుల్లొనూ తలకు ఎక్కిన్చుకోరు.


ఇదే వీరి మిద లక్షలాది మంది గుండెల్లో స్థానానికి చోటు కలిగింది.




రజని గారు సింపుల్ గా ఉంటూనే ఎవరికీ తెలియకుండా ఎన్నో గుప్త దానాలు చేసారు.


పవన్ కళ్యాణ్ ఐతే అయన సొంత డబ్బు ఎన్నో కోట్ల రూపాయలు పేదలు కష్టాల్లో ఉంటే దానంగా ఇచ్చేసారు. కానీ ఎవరికీ ఈ విషయం తెలియనివ్వలేదు.



ఇక ఈ ప్రాజెక్ట్ విషయాని వస్తే రజని కాంత్ గారి అల్లుడైన ధనుష్ ఈ చిత్రాన్ని తీస్తున్నారు.
ఈ సినిమా కు కాలా” అనే టైటిల్ ను మీడియా ముందు ఖరారు చేసి రిలీజ్ చేసారు.
   


ఈ చిత్రాన్ని 2018 లో గానీ లేక అంతకు ముందు గానీ రిలీజ్ చేస్తారు.
ఉండేర్ బార్ పిల్మ్స్ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.




ప్యాన్స్ ఈ విషయం లో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయన గెట్ అప్ చాలా బాగుందననీ, అచ్చం కబాలి” లో లాగానే ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు..






So, All the best to Super Star Rajani's Fans.



THANKS FOR WATCHING…


ధన్యవాదములు:
మరిన్ని వివరాలకోసం ఈ క్రింది సైట్ ని కానీ లేక వీడియో ని కానీ ఫాలో అవవ్వండి: www.powerstarlatestnews.blogspot.com
THANKYOU..

Tuesday, May 23, 2017

జనసేన పార్టీ రాక తో అధికార ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది

ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రైవేటు సర్వే సంస్ధ ఒకటి రాష్ట్రం లో ఒక సర్వే ని నిర్వహించింది. అందులో తెలిసిన నిజాలకు ఇప్పుడున్న అధికార ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

ఇప్పటికిప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు నిర్వహిస్తే అధికార పార్టీ అయిన టి.డి.పి కి 71 సీట్లు, జనసేన పార్టీ కి 66 సీట్లు ఇక ప్రతిపక్ష పార్టీ అయిన వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ కనీసం బొనీ కుడా కొట్టదని ఆ సంస్థ అంచనా వేసింది.
ఐతే తూర్పున మాత్రం వై.ఎస్.ఆర్.సి.పి కి ఒక్కటంటే ఒక్క సీటు మాత్రం రావచ్చనే అంచనాకు వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన 'జన సేన పార్టీ' తన పరిధిని చాప కింద నిరు లా విస్తరించుకుంటూ పోతోందనీ. ఈ పార్టీ యొక్క సిధాంతాలను ఇప్పటికీ ప్రజలకు ఎప్పుడూ చెప్పకపోయినా పార్టీ పై ప్రజల్లో నమ్మకం పెరగడానికి ఈ మధ్య జరిగిన కొన్ని సంగటనలే కారణం అని తెలుస్తుంది.

దీనికి కారణం ఏమిటంటే పవన్ అప్పుడెప్పుడో రాజధాని రైతుల భూముల సమస్యను వాళ్ళ దగ్గరికి వెళ్లి మరీ పరిష్కరించడం దగ్గరనుంచీ మొన్న ఉద్దానం సమస్యను ఆతరువాత' గ్రూప్ 2' నోటిఫికేషన్ కి సంబంధించి నిరుద్యోగుల జే.ఆర్.సి కి మద్దతుగా ఎటువంటి స్వార్ధం లేకుండా నిలబడి ఆ సమస్యను కుడా పరిష్కరించే వరకూ ప్రజలందరి సమస్యలనూ ప్రభుత్వం దృష్టికి తీసుకు  వెళ్ళి  పరిష్కరించడమేరించడమే ఇందుకు కారణం గా చెప్పవచ్చు.


'జనసేన' పార్టీ ఇలాగే ప్రజల పక్షాన పోరాడుతూ పొతే తమ పార్టీ లకు ప్రజల్లో ఎక్కడ అసహనం పెరిగి పోతుందో అని అధికార ప్రతిపక్ష నేతలు అప్పుడే 'జనసేన' పార్టీ పై ప్రజల్లో ఏ విధంగా బురదలు జల్లాలనే దానిపై మల్ల గుల్లలు పడుతున్నట్టు తెలిసింది.

వివరాలకు ఈ క్రింది వీడియో ని చూడండి:


మరిన్నివార్తల కోసం ఈ బ్లాగ్ ని సందర్శించండి: www.powerstarlatestnews.blogspot.com

THANKYOU..




Monday, May 22, 2017

Pawan Kalyan movie: Trivikram very serious with Keerthi suresh



పవన్ కళ్యాణ్  త్రివిక్రమ్ ల 25 వ మరియూ లేటెస్ట్ సినిమా అయిన 'గోకుల కృష్ణుడు' (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) షూటింగ్ లో ఒక సంఘటన చోటుచేసుకుంది.


ఒక సారి త్రివిక్రమ్ సినిమాలో పవన్ మరియూ కీర్తి సురేష్ ల పై ఒక కీలక మైన రొమాన్స్ తో కూడిన సన్నివేశం తీయబోయారు.



త్రివిక్రమ్ పవన్ కి ఒక్కసారి చెప్తే ఎంత పెద్ద షాట్ గురించి చెప్పినా వెంటనే చేసేస్తాడని తెలుసు.. 

ఐతే త్రివిక్రమ్ కీర్తి సురేష్ కి సీన్ గురించి క్లియర్ గా వివరించి చెప్పి అంతా సిద్ధం చేసుకున్నాక షాట్ తీయబోయే ముందు తన స్థానం లో కుర్చుని ఏక్షన్ అని చెప్పగానే కీర్తి ఏమి ఆక్షన్ చేయకుండా పవన్ ను తదేకంగా ఒక 5 ని|| లు చూస్తూనే ఉండిపోయింది.

అప్పుడు త్రివిక్రమ్ రెండు మూడు సార్లు కీర్తి కి చెప్పి చూసారు అయినా తను త్రివిక్రమ్ చెప్పింది వినకుండా పరిశ్రమకు అప్పుడే వచ్చినట్టు బెహేవ్ చేసింది.



అప్పుడు కోపం ఆపుకోలేక త్రివిక్రమ్ కీర్తి సురేష్ పై అరచినట్టు తెలిసింది. 





ఐతే అక్కడే ఉన్న పవన్ త్రివిక్రమ్ ని సముదాఇంచి కీర్తి ని దగ్గర కూర్చోబెట్టుకుని సీన్ తేసేటప్పుడు ఆ సీన్ గురించే ఆలోచించాలి తప్ప మిగిలిన వాటి గురించి పట్టించుకోవద్దని చెప్పి తనకు ఏ ఇబ్బంది ఉన్నా సరే తనతో చెప్తే సమస్యను తీరుస్తానని మాట ఇచ్చారు.

ఇంతకూ ఏమి జరిగిందంటే అది రొమాంటిక్ సీన్ అవడం వలన కీర్తి సిగ్గు పడిందని సమాచారం.

కానీ తను మాత్రం ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ మరియూ ఇతర నటి నటుల సహకారం తో  ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పింది. తనకు షూటింగ్ కి వచ్చినట్టు కాకుండా ఎదో విహార యాత్రకు కుటుంబ సభ్యులతో వెళ్లి గడుపుతున్నట్టు ఉందని చెప్పింది.

ఐతే తమిళ నటి అయిన ఖుష్బు కుడా పవన్ సినిమాలో చేసే అవకాసం రావడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్త పరిచారు.
తనకు ఐతే ప్రతి రొజూ మొదటి రోజు స్కూల్ కి వెళ్లి నట్టు ఉందని చెప్పింది.


ఐతే సినిమాలో కామెడీ ట్రాక్ మాత్రం అందర్నీ ఎంతో అలరిస్తుందని నటి నటుల వివరాల ను బట్టి చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మురళి శర్మ మధ్యన వచ్చే సన్నివేశాలు కడుపు చెక్కలయ్యేలా ఉంటాయని తెలుసుకున్నాం.



సో సెప్టెంబర్ వరకూ ఆగితే పవర్ స్టార్ ప్యాన్స్ కు పండగే.. ఎందుకంటే ఫిల్మ్ నగర్ లో న్యూస్ ప్రకారం ఈ సినిమా మరో జల్సా కంటే కుడా చాలా గొప్ప ఎంటర్టైనర్ అవుతుందని అర్ధమయ్యింది.


ధన్యవాదములు:


మరిన్ని పవన్ కళ్యాణ్ క్రొత్త వర్తలూ మరియూ విశేషాల కోసం ఈ క్రింది వీడియో ని మరియూ వెబ్ సైట్ ని క్లిక్ చేయండి:

  www.powerstarlatestnews.blogspot.com




 THANK YOU..

Sunday, May 21, 2017

పవన్ కళ్యాణ్ ని దిమ్మతిరిగే ప్రశ్న అడిగిన అనంతపూర్ స్టూడెంట్ | Power Star Pawan kalyan Shocked

శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమాల పరంగానూ అటు రాజకీయాల పరంగానూ తనదైన ప్రతిభా మరియూ విశిష్టతను ప్రదర్సిస్తూ దూసుకుపోతున్నారు.




ఈ మధ్య అనంతపూర్ జిల్లాలో గుత్తి పట్టణం లో ఉన్న గేట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ కాంపస్ లో స్టూడెంట్స్ తో ముఖా ముఖి లో మాట్లాడారు.




అక్కడ ఉన్న వాళ్ళల్లో ఆశ అనే ఒక అమ్మాయి అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ గారినే కాక అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.



గతం లో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యెక హోదా రావడం కోసం నేను నిరాహార దిక్షకి కుడా వెనుకాడనని చెప్పారు. ఆ అమ్మాయి ఆ విషయాన్ని గుర్థుచేస్తూ మీరు గతం లో ఈ విధంగా అన్నారు కదా మరి ఇప్పటికీ మన రాష్ట్రానికి ప్రత్యెక హోదా రాలేదు. 
మీరు అన్న మాట కోసం ఇప్పుడు ఎందుకు మీరు నిరాహార దీక్ష చెయ్యట్లేదు? అని అడిగింది.


దానితో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
ఐతే పవన్ కళ్యాణ్ గారు వెంటనే చాలా చక్కగా బదులు చెప్పారు.


తను చెప్పిన మాటలు ఎప్పుడూ మరిచిపొననీ, అన్నీ తనకు గుర్తున్నాయనీ, ఐతే నేను నిరాహార దీక్ష చేయడం అనే దానికన్నా మనకు ఎంతవరకూ న్యాయం జరిగింది? అనేదే ముఖ్యం. దానికి ఉదాహరణగా చెప్తూ మనం యుద్ధం చేసేముందు అవతల వాడు ఎలా ప్రవర్తిస్తాడు? మనల్ని ఇలా దెబ్బ తీయాలని అనుకుంటున్నాడు? అనేది ఆలోచించాలి అలా కాకుండా మాట ఇచ్చాం కదా అని యుద్ధం లోకి దిగితే ప్రయోజనం ఉండదు అని చెప్తూ..

ఇప్పుడు నేను దీక్ష చేయడం వలన రాష్ట్రం లో ఉన్న విద్యార్ధులూ మరియూ నా అభిమానులూ ఊరుకోరనీ.. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ భవనాలూ విద్యాలయాలూ మూతపడతాయనీ , ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవడమే కాకుండా ప్రభుత్వానికి కుడా తీరని నష్టం కలుగుతుందనీ,  అలా మనం ప్రత్యేక హోదా తెచ్చుకోవడం అర్ధం లేనిదని అలాగని ప్రత్యెక హోదా విషయం లో విజయం సాధించేవరకూ వదిలి పెట్టేది లేదని అన్నారు.

పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చెప్పేసరికి అక్కడ ఒక్కసారిగా మొత్తం స్టూడెంట్స్ అరుపులూ చప్పట్లతో కాలేజ్ కేంపస్ మొత్తం దద్ధరిల్లి పోయింది. ఐతే ఆయనను ప్రశ్నించిన అమ్మాయి కుడా ఆ సమాధానానికి నివ్వెరపోయి తనుకూడా చప్పట్లు కొట్టింది.

ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మరో సారి శ్రీ పవన్ కళ్యాణ్ తన గొప్ప తనాన్నిచాటుకున్నారంటూ అయన అభిమానులు గర్వ పడుతున్నారు.

దటీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ధన్య వాదములు:

మరిన్ని పవన్ కళ్యాణ్ క్రొత్త వర్తలూ మరియూ విశేషాల కోసం : ఈ సైట్ లేదా క్రింద ఇచ్చిన వీడియో ని క్లిక్ చేసి చుడండి..

www.powerstarlatestnews.blogspot.com



THANKYOU :)